• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాన్సువాడలో 42 మందిపై కేసు: ఎస్పీ

KMR: బాన్సువాడలోని రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాళ్లు విసిరిన ఘటనలో ఇప్పటివరకు 42 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 23, 2026 / 08:43 AM IST

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు

AP: తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. తెలంగాణకు చెందిన భక్తురాలు మౌనిక(27)ను పాము కాటేసింది. ఆలయ సిబ్బంది వెంటనే భక్తురాలిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:43 AM IST

నర్వలో రంజాన్ పవిత్ర వాతావరణం

NRPT: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ నెల సందర్భంగా నర్వ మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జామా మసీద్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం భక్తులు తరలవచ్చేలా రంగురంగుల వెలుగులతో మసీదు శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. రాత్రి వేళల్లో మసీదు మెరిసిపోతోంది. ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రత్యేక నమాజ్‌లు నిర్వహిస్తున్నారు.

February 23, 2026 / 08:41 AM IST

వాటర్ ట్యాంకును పరిశీలించిన.. నగర మేయర్.!

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శంభునిపేట కాలనీలోని వాటర్ ట్యాంక్‌ను నిన్న రాత్రి నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అంతరాయం లేకుండా సరఫరా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు ఉన్నారు.

February 23, 2026 / 08:40 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

NZB: వర్ని మండలం అక్బర్ నగర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్- లారీ ఢీకొన్న ఘటనలో పాత వర్నికి చెందిన భూమయ్యకు గాయాలయ్యాయి. వర్ని 108 సిబ్బంది రామకృష్ణ, గౌస్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:40 AM IST

మూసీ పేరుతో వ్యాపారం వద్దు: హరీశ్ రావు

SDPT: మూసీ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం చేసే ప్రతి పని వెనుక భూముల పంచాయతీ, వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు.

February 23, 2026 / 08:39 AM IST

కొనసాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితుల ఆందోళన

PDPL: ముత్తారం మండలంలోని లక్కారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించే వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు కేవలం సర్వేలతో కాలయాపన చేస్తూ తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, అప్పటివరకు పోరాటం ఆపేది లేదన్నారు.

February 23, 2026 / 08:38 AM IST

ఈదురు గాలుల బీభత్సం: మొక్కజొన్న పంట ధ్వంసం

MHBD: బయ్యారం మండలం బీరొనిమడుగు, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో 30 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. చేతికి వచ్చిన పంట నెల రావడంతో అన్నదాతలు కన్నీటి పరేమయ్యారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 08:38 AM IST

‘సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తాం’

PLD: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

February 23, 2026 / 08:36 AM IST

బేతంచెర్ల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి పర్యటన

NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుడు కేశవరావు కుమారుని వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాటసాని జయమ్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.

February 23, 2026 / 08:36 AM IST

‘విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలు సాధించాలి’

PPM: ఇంటర్మీడియట్ పరీక్షలు రాయిబోయే విద్యార్థులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఆంతా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే మీ భవిష్యత్ బాగుండడంతో పాటు కుటుంబానికి, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళవుతారన్నారు.

February 23, 2026 / 08:35 AM IST

వద్దిపట్లలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లలో ముత్యాలమ్మ విగ్రహానికి ఆ కాలనీ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘనంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. రానున్న రోజులలో గుడి నిర్మాణం చేసుకుని పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ నాయకుడు దున్న ముత్యాలు అన్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దున్న ఆంజనేయులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:35 AM IST

ఎమ్మెల్యే సహకారంతో సొంతింటి కల నెరవేరింది

WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సొంతింటి కల నెరవేరిందని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కవిత, దేవేందర్ తెలిపారు. అనంతరం వారు HIT TVతో మాట్లాడుతూ.. గత 10 సం,గా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్పంచ్ శేఖర్ గౌడ సహకారంతో నెరవేరిందని అన్నారు.

February 23, 2026 / 08:34 AM IST

అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

ATP: గుత్తిలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాలలో సోమవారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్దకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 08:34 AM IST

బాల, బాలికలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం ఆగినిపర్రు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన మండల స్థాయి బాల, బాలికల ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు.

February 23, 2026 / 08:30 AM IST