AP: తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం క్యూలైన్లో పాము కలకలం రేపింది. తెలంగాణకు చెందిన భక్తురాలు మౌనిక(27)ను పాము కాటేసింది. ఆలయ సిబ్బంది వెంటనే భక్తురాలిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.