MHBD: బయ్యారం మండలం బీరొనిమడుగు, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో 30 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. చేతికి వచ్చిన పంట నెల రావడంతో అన్నదాతలు కన్నీటి పరేమయ్యారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.