WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శంభునిపేట కాలనీలోని వాటర్ ట్యాంక్ను నిన్న రాత్రి నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అంతరాయం లేకుండా సరఫరా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు ఉన్నారు.