VZM : నేటి యువత భాషా సాహిత్యాలు అలవర్చుకోవాలని ప్రధాన వక్త మేడూరి సత్యనారాయణమూర్తి అన్నారు. గజపతినగరంలో లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో భాగవతంలోని రుక్మిణి కళ్యాణం అనే అంశంపై చైతన్య భారతి ఏర్పాటుచేసిన సభలో శుక్రవారం ప్రసంగించారు. సభకు చైతన్య భారతి అధ్యక్షులు బుద్ధరాజు వెంకట శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది.
BPT: కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 7,696 మంది లబ్ధిదారులకు రూ.3.31 కోట్లు అందించనున్నారు. దీనికోసం 159 మంది సిబ్బందిని నియమించారు. వీరు ఉదయం 6.30 గంటల నుంచే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. అందరికీ నూరు శాతం పెన్షన్లు అందేలా చూడాలని MPDO శ్రీనివాసరావు అన్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయ ధ్వజస్తంభం ఏర్పాటులో జరిగిన నిధుల గోల్మాల్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటులు మోహన్లాల్, దిలీప్ స్టేట్మెంట్లను కేరళ పోలీసులు రికార్డ్ చేశారు. 2017లో ధ్వజస్తంభం పునరుద్ధరణ సమయంలో జరిగిన అవకతవకలు, నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
AKP: దేమునిగుమ్మం శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని పెండ్లికుమారునిగా అలంకరించి గరుడ ఆల్వార్లకు పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు.
TG: హైదరాబాద్లోని బౌద్ధనగర్ వారాసిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీలను పరిశీలించారు. వాడవాడ తిరుగుతూ బీజేపీ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను విన్న కిషన్ రెడ్డి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్లోనూ ఇదే రిథమ్ కొనసాగించాలని సూచించాడు. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా, అందరూ కలిసికట్టుగా రాణించారని అభినందించాడు.
VKB: మోమిన్పేట్ బస్టాండ్లో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. భూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన గ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. అక్కడికక్కడే కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే ఈ ఘటన జరగడంతో తోటి ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
SRD: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
E.G: దేవరపల్లిలోని ఎస్సీ ఏరియాలో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా మంచి నీటి పైపుల చుట్టూ మురుగు నీరు కుంటల్లా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరిచి, మంచినీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
PLD: అమరావతి రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బుద్ధ విగ్రహానికి సరికొత్త మెరుగులు దిద్దుతున్నారు. విగ్రహంపై పాత రంగులు వెలిసిపోవడంతో, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టింది. ఈ నూతన మెరుగులు విగ్రహానికి కొత్త శోభను చేకూర్చడమే కాకుండా, పర్యాటక ప్రాంతంగా అమరావతి వైభవాన్ని మరింత పెంచనున్నాయి.
NLG: కట్టంగూర్ మండలం అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై నకిరేకల్ లోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, నాణ్యత ప్రమాణాలు, నిధుల వినియోగం, పనుల వేగవంతంపై సమగ్రంగా చర్చించారు.
WGL: ఎంపీ కడియం కావ్య ప్రవేశపెట్టిన “అనాథ వితంతువులు, ఒంటరి మహిళల (రక్షణ, పునరావాసం, సంక్షేమం) బిల్లు–2025”కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 117(3) ప్రకారం బిల్లును పరిశీలించేందుకు రాష్ట్రపతి సిఫార్సు చేసినట్లు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి శుక్రవారం లేఖ ద్వారా తెలియజేశారు.
HYD: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు వినతిపత్రం అందజేశారు. వెంటనే ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబో మూవీలో మృణాల్ ఠాకూర్ నటిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బన్నీకి ఫిల్మ్ఫేర్ అవార్డు రాగా, మృణాల్ శుభాకాంక్షలు తెలిపింది. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘త్వరలో నీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా’ అంటూ కన్నుకొట్టే ఎమోజీతో హింట్ ఇచ్చాడు. అట్లీ మూవీ కాకపోయినా, వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
W.G: ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మార్చి 8న జరుగుతుందని ఆకివీడుకు చెందిన పద్మశాలి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు సప్పా మణికంఠ చెప్పారు. మార్చి 8 ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం, రాష్ట్ర యువజన సంఘం నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.