AKP: దేమునిగుమ్మం శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని పెండ్లికుమారునిగా అలంకరించి గరుడ ఆల్వార్లకు పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు.