• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రతిభ గల పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం’

MNCL: ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 04:58 PM IST

ప్రజావాణిలో 156 దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్

మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 156 దరఖాస్తులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వీకరించారు. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ కేటాయించి వెంటనే వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదుల్లో అత్యధిక శాతం పింఛన్ సదరన్ క్యాంపుకు సంబంధించినవే ఉన్నాయి.

February 23, 2026 / 04:57 PM IST

‘జైలులో సత్ప్రవర్తనతో మెలగాలి’

SKLM: ముద్దాయిలు జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని, శిక్షా కాలం ముగిసిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. సోమవారం అంపోలులోని జిల్లా కారాగారాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

February 23, 2026 / 04:56 PM IST

ఎమ్మెల్యేపై దాడి నిరసనగా బీజేపీ ఆందోళన

NRPT: కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు నారాయణపేట అంబేద్కర్ కూడలిలో నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 04:54 PM IST

‘అంగన్వాడీల హామీలు అమలు చేయాలి’

VSP: అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వెంటనే వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. హామీల అమలుకోసం సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 18 నెలలు గడిచినా చర్యలు లేవన్నారు. 1972 యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ, సంక్షేమ పథకాలు, వేసవి సెలవులు, అదనపు పనిభారం తగ్గింపు కోరారు.

February 23, 2026 / 04:53 PM IST

‘దేవుడి పేర్లు రాజకీయాలకు వాడొద్దు’

ASR: దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఈమేరకు సోమవారం అనంతగిరి మండలం గుమ్మా పంచాయితీలో శ్రావణ్ కుమార్ విలేకర్లతో మాట్లాడారు. టీటీడీలో వైసీపీ హాయాంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

February 23, 2026 / 04:52 PM IST

తెలంగాణ ఉద్యమకారులకు GOOD NEWS

TG: రాష్ట్ర ఉద్యమకారులకు సంబంధించి ‘అభయహస్తం’ పథకం అమలుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం.. 8 వారాల్లోగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు రూ.25,000 పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

February 23, 2026 / 04:51 PM IST

కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: ఖానాపురం(మం) అయోధ్యనగర్‌లో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడ సంఘ అభివృద్ధికి తాను ప్రత్యేక కృషి చేస్తానని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

February 23, 2026 / 04:51 PM IST

‘న్యాయవాదులపై దాడులు అరికట్టాలి’

కోనసీమ: కర్నూలు జిల్లాలో న్యాయవాది పవన్ కుమార్‌పై జరిగిన దాడిని ఆలమూరు బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కర్నూలు పోలీస్ స్టేషన్లో సిఐ విక్రమసింహ న్యాయవాది పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసిన ఘటన న్యాయవర్గాలను కలిచివేసిందని వారు పేర్కొన్నారు. సోమవారం న్యాయవాది వేమగిరి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలమూరు కోర్టులో విధులు బహిష్కరించారు.

February 23, 2026 / 04:50 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి’

PDPL: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే, త్వరగా పరిష్కరించే విధంగా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలు, భూమి సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, అధికారులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:50 PM IST

సిద్దిపేటలో క్రీడా పోటీలను ప్రారంభించిన సీపీ

సిద్దిపేట స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం వార్షిక క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడలను ప్రారంభించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభకనబరచడం అభినందనీయమన్నారు.

February 23, 2026 / 04:49 PM IST

పునర్విక కోసం విరాళాల సేకరణ

SKLM: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ‘ సేవ్ పునర్విక ‘అంటూ వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడటానికి సోషల్ మీడియా మొత్తం ఏకమైంది. రూ.16కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కోసం ఫండ్ రైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈమేరకు మందస మండలానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూ‌యెన్సర్లు, యువత స్పందించారు. పునర్విక కోసం విరాళాలు సేకరణ సోమవారం ప్రారంభించారు.

February 23, 2026 / 04:48 PM IST

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

BHNG: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మోత్కూర్ మండలంం దాచారంలో మహిళా సంఘాల సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

February 23, 2026 / 04:48 PM IST

‘విజయ్-రష్మిక’ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉండవచ్చు? అని అభిమానులు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ వయసు 36 ఏళ్లు కాగా, రష్మిక వయసు 30 ఏళ్లు. వీరి మధ్య ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. వయసులో పెద్దగా తేడా లేకపోవడంతో వీరిద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని కామెంట్లు చేస్తున్నారు.

February 23, 2026 / 04:48 PM IST

‘పంట నమోదు పకడ్బందీగా నిర్వహించండి’

RR: పంట నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్ల సహాయంతో గ్రామాల్లోకి వెళ్లి పంటలను నమోదు చేయాలని కోరారు. అదేవిధంగా యూరియా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

February 23, 2026 / 04:46 PM IST