NZB: నవీపేట్ మండల పరిధిలోని ఫకీరాబాద్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని గంజిగావ్ నుంచి నిజామాబాద్కు ఇసుక తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
AKP: కోటవురట్ల మండలం రాజుపేట ఎంపీయూపీ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MEO రామారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాలన్నారు. సైన్స్తో ఎంతో అభివృద్ధి సాధించవచ్చునన్నారు. అగ్రికల్చర్ ఫార్మింగ్, నీటి పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.
KDP: బద్వేల్ నియోజకవర్గంలోని చెరువుల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జ రోశన్న సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలపై చర్చించారు. చెరువులను పరిశీలించి మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు.
AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. కె.విజయానంద్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం విధుల్లోకి వస్తారని పేర్కొంటూ గతేడాది నవంబర్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు.
TG: లండన్లోని క్రొయిడాన్ ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న నిజామాబాద్కు చెందిన సాయి శ్రీకర్ను వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధరించారు. ఇతను పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
BPT: పిల్లలువారిపాలెంలో అభయ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నేత శివప్రసాద్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. అనంతరం స్వామి వారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రేపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కొలసాని రాము పాల్గొన్నారు.
VKB: పట్టణాన్ని క్లీన్ & గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం మున్సిపల్లో శానిటేషన్ పనులను కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎక్కడా చెత్తాచెదారం ఉంచకుండా పరిశుభ్ర వాతావరణం కల్పించాలన్నారు.
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరిలో రేపటి నుంచి పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కరుణగిరి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టోర్నీ వాల్పోస్టర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు.
E.G: నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామం చెందిన తిరుమలశెట్టి లక్ష్మీ మంగతాయారు గుండె సంబంధిత వ్యాధి చికిత్స కోసం LOC రూ.4.50 లక్షల మంత్రి కందుల దుర్గేశ్ అందజేశారు. ఆమె చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నంను బాధిత కుటుంబ సభ్యులు కలవగా వారు ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో LOC మంజూరు అయ్యింది.
CTR: గుడిపాల పలు గ్రామాల్లో అడవి ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు 4 కుంకీ ఏనుగులను రప్పించారు. ఈ ఏనుగులకు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు స్థానిక అటవీశాఖా సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చర్యతో పంట నష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
SDPT: హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, దుకాణ యజమానులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కోరారు. ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్సులు మార్చి 31వ తేదీలోపు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. పన్నులు వసూలు చేయడానికి వచ్చే సిబ్బందికి సహకరించాలని తెలిపారు.
కోనసీమ: ప్రజల సుఖసంతోషాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం మండపేట పట్టణంలో పలువురు లబ్దిదారుల ఇంటికి వెళ్ళి ఫించన్లు పంపిణీ చేశారు. అదే విధంగా 12వ వార్డులో కర్ణం సత్యవతి, 17వ వార్డులో నాయుడు భద్రమ్మలకు కొత్తగా మంజూరైన స్పౌస్ ఫించన్లను ఆయన పంపిణీ చేశారు.
NTR: ఏ. కొండూరు తండా రైతులు మేజర్ కాలువ చివరి వరకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. కాలువ కింద వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని, వెంటనే నీళ్లు విడుదల చేసి చివరి వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
BDK: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంబపాటి శ్రీనివాస్ తనయుడు కంబపాటి జశ్వంత్ ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
W.G: నరసాపురం (M) ఎల్బిచర్ల బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మార్చి 1న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. శ్యాంప్రసాద్ తెలిపారు. గురుకుల పాఠశాలలో ఆదివారం ఈ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.