• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: సబ్ కలెక్టర్

KMR: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకాంక్షించారు. జుక్కల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు.

February 28, 2026 / 12:49 PM IST

MPDOకు డిప్యూటీ సీవోగా పదోన్నతి

RR: మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సంధ్యకు పదోన్నతి లభించింది. గత నాలుగేళ్లుగా మొయినాబాద్‌లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆమె కృషి, నిబద్ధత, పారదర్శకతకు గుర్తింపుగా డిప్యూటీ సీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

ఖండ శాఖల సంగమం విజయవంతం చేయాలి: రాంరెడ్డి

NRPT: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఊట్కూర్ ఖండలో నిర్వహించనున్న ఖండ శాఖల సంగమాన్ని విజయవంతం చేయాలని ఖండ సంఘచాలక్ శ్రీ రాంరెడ్డి కోరారు. ఖండ పరిధిలోని 56 గ్రామాలకు చెందిన స్వయం సేవకులు ఉదయం 7 గంటలకు జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఒకే వేదికపై సమావేశమవుతారని తెలిపారు.

February 28, 2026 / 12:48 PM IST

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలి: ఏడీఏ

KMM: పీఎం కిసాన్, కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వర రావు అన్నారు. శనివారం కామేపల్లి మండలంలో మద్దులపల్లి గోవింద్రాల నెమలిపురి గ్రామాల్లో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిలో నిలిచిందన్నారు.

February 28, 2026 / 12:48 PM IST

కాకుమానులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: కాకుమానులోని ఇండియన్ స్కూల్ వద్ద ఉన్న బస్టాండ్‌లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిన వారు వెంటనే కాకుమాను పోలీసులను సంప్రదించాలన్నారు.

February 28, 2026 / 12:47 PM IST

రేవంత్ రెడ్డికి కూల్చడమొక్కటే తెలుసు: ఈటల

TG: వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 కంటే ముందు నుంచి ఉన్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందన్నారు. ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చడమొక్కటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తెలిసింది అని ఎద్దేవా చేశారు.

February 28, 2026 / 12:46 PM IST

అంబులెన్స్ వాహనాలు సరిపోక కష్టంగా చివరి మజిలీ..!

HYDలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చివరి మజిలీ చాలా కష్టంగా మారిందని బాధితులు లబోదిబోమంటున్నారు. రోజు దాదాపుగా 50 కి పైగా కేసుల్లో మృతదేహాలకు పైగా పోస్టుమార్టం జరుగుతుంది. కానీ.. మృతదేహాలను తరలించేందుకు సరైన సంఖ్యలో అంబులెన్సులు లేకపోవడంతో, ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2026 / 12:46 PM IST

ధైర్య స్పర్శ, సైబర్ నేరాల పై అవగాహన

CTR: ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు మండలం అమ్మపల్లి గ్రామంలో ఎస్సై శ్రీ డి.గోపి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధైర్య స్పర్శ, సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలు మరియు CCTV ఏర్పాటు యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించారు. గ్రామస్తులు చురుకుగా పాల్గొన్నారు.

February 28, 2026 / 12:46 PM IST

కెప్టెన్‌ను టార్గెట్ చేయడం సిగ్గుచేటు: పాక్ పేసర్

T20 WC-2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆషూపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సల్మాన్ మీర్జా స్పందించాడు. ఒక ఆటగాడు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటాడని, ఏదో ఒక రోజు సరిగా ఆడకపోతే వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నాడు. ఇలాంటివి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు.

February 28, 2026 / 12:46 PM IST

భక్తిశ్రద్ధలతో సనంకరమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

ATP: గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండ గ్రామంలో నూతన సనంకరమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హాజరయ్యారు.

February 28, 2026 / 12:45 PM IST

పట్టుపురంలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి

SKLM: కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో శనివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికి త్వరలో పింఛన్లు అందజేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

February 28, 2026 / 12:45 PM IST

కర్విరాల గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన

SRPT: నడిగూడెం మండలం కర్విరాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తి మార్గం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

February 28, 2026 / 12:43 PM IST

పరిగి చెరువులో పడి వ్యక్తి మృతి

సత్యసాయి: పరిగి మండలం స్థానిక చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇతర కారణాలున్నాయా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 12:40 PM IST

ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు నిర్మల్ విద్యార్థులు

NRML: నిర్మల్ సోమవారపేట ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఎస్. వైష్ణవి, ఎం.చరణ్య ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు పరమేశ్వర్ శనివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు అభినందించారు.

February 28, 2026 / 12:40 PM IST

వరలక్ష్మి ‘సరస్వతి’ కోసం నయనతార

నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరస్వతి’. మార్చి 1న ఉదయం 10:04 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. అయితే ఈ పాటను నయనతార రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 28, 2026 / 12:40 PM IST