BPT: పాత బస్టాండ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ఈరోజు మరియు ఆదివారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు కొనసాగుతుందని పేర్కొన్నారు.
SRPT: అనంతగిరిలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళాలో విద్యార్థులు 25కు పైగా ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. “వికసిత భారత్కు మహిళా శాస్త్రవేత్తలు ఉత్ప్రేరకాలు” అన్న థీమ్తో ఈ సైన్స్ మేళా నిర్వహించినట్లు HM సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సైదులు, నాంచారయ్య, బాబు, ఓంకారం, CRP హైమవతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
BDK: దమ్మపేట మండలం గండుగలపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక భారం తగ్గిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SDPT: చేర్యాల మున్సిపల్ పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణలో అధికారులు ప్రోటోకాల్ విస్మరించడం చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఫ్లెక్సీని మార్చారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
PPM: గుమ్మలక్ష్మి పురంలో శనివారం స్దానిక పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో పలు కాలనీలలో ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రజకవీధి, చింతల గూడ, పెంకుటిల్లు కాలనీలలో చేతిపంపు మరమ్మతులు జరిపినట్లు సర్పంచ్ గౌరీశంకర్రావు పేర్కొన్నారు. గ్రామంలో ఎక్కడైనా బోర్లు పాడైపోయి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని కూడా బాగు చేయిస్తామని తెలిపారు.
VSP: రామ్నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యలపై వినతిపత్రాలు అందించగా, వాటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరిత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి రాంబిల్లి కార్యక్రమానికి బయలుదేరారు.
TG: వికారాబాద్ జిల్లాలో సూసైడ్లెటర్ రాసి కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకుంది. ధరూర్ పోలీస్స్టేషన్లో దివ్య విధులు నిర్వహిస్తోంది. దివ్య ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
VZM: వంగరలోని మడ్డువలస BR అంబేద్కర్ బాలికల గురుకులంలో ప్రవేశాలకు రేపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాధిక శనివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 9:30 నుంచి 11 వరకు 5 వ తరగతి, 12 నుంచి 1:30 వరకు ఇంటర్మీడియట్కు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్ట్ ఇయర్ MPCకి 50, బైపీసీకి 40 సీట్లు కేటాయించామని విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరాలన్నారు.
TPT: అవ్వ తాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన గూడూరు మండలం గాంధీనగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను 4000 రూపాయలకు పెంచి అందజేస్తుందన్నారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ 2.0 అప్డేట్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తి క్రయవిక్రయాలు జాప్యమయ్యాయి. 3 రోజులుగా పోర్టల్ పని చేయకపోవడంతో శుక్రవారం మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగలను బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. సమస్యలు త్వరలో పరిష్కరించి రెండు, మూడు రోజుల్లో సేవలు పునరుద్ధరిస్తామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.
CTR: పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు శ్రీవారిని దర్శించగా మహిళలు కర్పూర హారతులు పట్టారు. ఇవాళ సాయంత్రం గరుడసేవ జరగనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
వారణాసిలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో హోలీ సంబరాలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ రంగులకు బదులుగా చితి నుంచి సేకరించిన బూడిదను ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. మశాన హోలీగా పిలిచే ఈ వేడుకలో భక్తులు శివనామాలు జపిస్తూ, డోళ్లు వాయిస్తూ ఘాట్ల గుండా ఊరేగింపుగా వెళ్తారు. మరణాన్ని కూడా సంబరంగా మార్చే ఈ అరుదైన సాంప్రదాయాన్ని చూడటానికి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తారు.
CTR: గుడిపల్లె మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శనివారం పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ప్రతినెల కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
KMR: మద్నూర్ స్థానిక మార్కెట్లో శనివారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం అమ్మకానికి పరిగె పత్తి మాత్రమే వస్తోందని, మరో ఇరవై రోజుల్లో వ్యాపారం పూర్తిగా ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్లో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గిందని దీంతో రెండు నెలల ముందే మార్కెట్ ముగింపు దశకు చేరుకుందన్నారు.
NLG: చింతపల్లి మండలం గోడుకొండ్ల అలివేలు మంగ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఊరె లక్ష్మణ్ ఎమ్మెల్యేను సన్మానించి జాతరకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భవాని పవన్ కుమార్, గోవర్ధన్, మాస భాస్కర్, మద్దెల కృష్ణ, రాజేష్, పాల్గొన్నారు.