పల్నాడు: గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.