• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘దశాబ్దాల సొంతింటి కల నెరవేరింద’

NRPT: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అర్హులైన నిరుపేదలకు గృహాల పంపిణీ కొనసాగుతోంది. ఏనుముల తిరుపతి రెడ్డి సాకారంతో పెదిరిపహాడ్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశ్‌కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని మల్లేశ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

February 20, 2026 / 05:46 PM IST

ఏడో తరగతి విద్యార్థిని కన్నుమూత

GDWL: ఆడుతూ పాడుతూ పాఠశాలకు రావాల్సిన చిన్నారి.. అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వేలింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల గోపాల్ కుమార్తె చందు(13) శుక్రవారం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని మరణవార్త తెలియగానే పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 20, 2026 / 05:46 PM IST

రోడ్డు నిర్మాణానికి రూ.2.53 కోట్ల నిధులు మంజూరు

SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామం నుంచి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు నిర్మాణానికి 2.53 కోట్ల నిధులు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రోజున రోడ్డు పనులు ప్రారంభించారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:45 PM IST

‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి’

VZM: గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే పిర్యాదులు సత్వరమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

February 20, 2026 / 05:45 PM IST

రైతు సంక్షేమానికి పెద్దపీట: MLA

JN: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘనపూర్లో సబ్సిడీపై అర్హులైన రైతులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని, దేశానికి వెన్నెముక రైతు అని ఎమ్మెల్యే అన్నారు.

February 20, 2026 / 05:44 PM IST

ఫ్లోరిడా ఎయిర్‌పోర్టుకు ట్రంప్‌ పేరు!

ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరు మారనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నారు. అనంతరం ఈ విమానాశ్రయం పేరు మార్పునకు ఫెడరల్ ఏవియేషన్ ఆమోదం కూడా అవసరం.

February 20, 2026 / 05:43 PM IST

‘ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టాలి’

NZB: జిల్లాలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు పరీక్షా కేంద్రాలతో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

February 20, 2026 / 05:42 PM IST

హరీష్ రావును కలిసిన వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు

HNK: హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో మాజీ మంత్రి టీ. హరీష్ రావును శుక్రవారం వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు ప్రవర్తించిన తీరు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, తుమ్మల యాకయ్య, కుమారస్వామి, ఏకాంతం, పిట్టల రాజు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:42 PM IST

కలుషిత ఆహారం.. విద్యార్థినులకు అస్వస్థత

TG: మెదక్ జిల్లా రేగోడ్ కస్తుర్భా గాంధీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఆహారం కలుషితమై 10 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో వారు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

February 20, 2026 / 05:41 PM IST

హైకోర్టులో పైలెట్‌కు ఊరట

VKB: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో తాండూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. పైలెట్‌తో పాటు మరో ఏడు మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ ద్వారా తాండూరు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

February 20, 2026 / 05:41 PM IST

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయదుర్గం నేతలు

ATP: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. రాయదుర్గానికి చెందిన రాజకుమార్, సుదర్శన్ రెడ్డిలకు ఈ పదవులు దక్కాయి. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటంలో వీరి సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

February 20, 2026 / 05:40 PM IST

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై

కృష్ణా: పెడనలోని ఆటో డ్రైవర్లకు ఎస్సై బషీరా శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డుపై అడ్డంగా ఆటోలను నిలిపివేయకూడదని, ప్రయాణికులను ఎక్కించడం, దించడం కోసం విశిష్ట ప్రదేశాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. స్కూల్ పిక్ సమయాలలో రోడ్లపై క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సహకరించాలన్నారు.

February 20, 2026 / 05:40 PM IST

మున్సిపాలిటీ సిబ్బందికి క్షయ వ్యాధిపై అవగాహన

NDL: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సిబ్బంది, శానిటరీ వర్కర్లకు క్షయ (టీబీ) వ్యాధిపై అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాకాతుమ్, సూపర్వైజర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఛాతి ఎక్సరే, స్పిరోమీటర్ పరీక్షల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. కొత్త రోగులను గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వారు తెలిపారు.

February 20, 2026 / 05:39 PM IST

రేపు వినుకొండలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

PLD: సీఎం చంద్రబాబు శనివారం వినుకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. అక్కడ ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

February 20, 2026 / 05:39 PM IST

నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

SRPT: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాలలో డీఐఈఓ భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సీఎస్డీఓల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 05:39 PM IST