ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం ముసునూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏడిఏ ఈవీ వెంకటరమణ పాల్గొని రైతులకు సూచనలు చేశారు. రైతులు సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని పేర్కొన్నారు. పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.