SKLM: సింహాచలంలో జరిగిన ఘటన బాధాకరమైన విషయమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని వివరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన కోరారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు.