NLR: కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందడంపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.