NTR: గంపలగూడెం మండలానికి చెందిన టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఐలూరి భార్గవరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొండ ఉపేందర్ రెడ్డి, ఆడెపు ఉదయ వెంకట సాయి తదితరులు వైసీపీలోకి చేరారు.