ప్రకాశం: బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వెలిగండ్ల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని గంధం కృపవరం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐటిసి బంగారు బాల్యం, కిషోర్ వికాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కరపత్రాలను ఆవిష్కరించారు.