NLR: కోవూరు (మం) పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైవేపై అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లగా, ఇంట్లోని వ్యక్తితోపాటు, ఐదుగురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన బాధాకరమని, గాయాలతో బయటపడ్డ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.