ADB: విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని సరస్వతి నగర్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా పోషకాల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన, నివారణ చర్యల గురించి వివరించారు.