• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

RTC డిపోలను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

SKLM: జిల్లా కేంద్రంలో ఉన్న 1,2 APSRTC డిపోలను జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శుక్రవారం సందర్శించారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెరుగ్గా అందజేయాలని డిపో అధికారులకు ఆదేశించారు. 2 డిపోల్లో ఉన్న అన్ని సెక్షన్లను తనిఖీ చేసి సిబ్బంది అందరితో గేట్ మీటింగ్ నిర్వహించారు. బస్సులు కండిషన్లో ఉంచాలన్నారు.

February 27, 2026 / 05:20 PM IST

గ్రహణం కారణంగా సేవలు నిలిపివేత

అన్నమయ్య: మార్చి 3న జరిగే చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ మోక్షానంతరం ఆలయ శుద్ధి, విశేష అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం, తీర్థప్రసాదం అందజేయబడుతుందని ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈఓ డి.వి. రమణారెడ్డి వెల్లడించారు.

February 27, 2026 / 05:20 PM IST

‘క్రీడల్లో యువత తమ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి’

BDK: నేటి యువత క్రీడల్లో తమ శక్తి సామార్థ్యాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేటలో యర్రపోతు పుల్లయ్య మెమోరియల్ కప్, సంతోష్ కుమార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ, మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు.

February 27, 2026 / 05:20 PM IST

విజయ్-త్రిష ప్రేమ నిజమేనా..?

TVK చీఫ్, హీరో విజయ్‌కు ఆయన భార్య విడాకుల నోటీసులు పంపించారు. అందులో ఒక హీరోయిన్‌తో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారంటూ సాగుతున్న ప్రచారానికి ఈ పరిణామం బలం చేకూర్చినట్లయింది.

February 27, 2026 / 05:20 PM IST

‘కొండమల్లేపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం’

నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిని ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుస్తామని సర్పంచ్ యుగంధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వాణిజ్య, నివాస రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.

February 27, 2026 / 05:19 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

NZB: నవీపేట్ మండలం పాల్దా-జన్నెపల్లి రహదారిపై కొండూర్ కమాన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం, ఎక్సెల్ స్కూటీని ఢీకొట్టింది. బీహార్‌కు చెందిన వ్యవసాయ కూలీలు పరశురాం, హరిచరణ్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారికి 108 ఈఎంటీ నవీన్, పైలట్ మురళీ కృష్ణ ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 05:18 PM IST

సివి రామన్ స్కూల్లో స్టీమ్ ఎక్స్‌పో ప్రదర్శన

W.G: భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టీమ్ ఎక్స్‌పో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను పదును పెట్టేంటెందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయిని అన్నారు. వేణుగోపాల్ రావు, సరిత, సుబ్రమణ్యం, రంగసాయి, పార్వతిదేవి, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:17 PM IST

పాతబస్తీలో ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్

HYD: ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్ ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్న అనితా మెండిరట్ట శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. చారిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పాతబస్తీలో పూసలు, గాజులు విక్రయించారు. వీటితోపాటు ఫేమస్ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఆస్వాదించారు.

February 27, 2026 / 05:17 PM IST

ట్రాఫిక్ రూల్స్ పాటించండి: ఎస్పీ

VKB: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం పరిగిలో ‘అరైవ్ అలైవ్’ భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించి, కానిస్టేబుళ్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

February 27, 2026 / 05:16 PM IST

ఒక్కరోజు ముందుగానే పింఛన్ ఇస్తాం: ఎంపీడీవో

అన్నమయ్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలంలో శనివారమే పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని 11,203మంది లబ్ధిదారులకు రూ.4 కోట్ల,92 లక్షల 56 వేల 500 లు అందచేస్తామన్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచే ఇస్తామన్నార.

February 27, 2026 / 05:16 PM IST

క్రియాశీలక సభ్యత్వంతో జనసైనికులకు భరోసా: రామయ్య

KDP: దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కల్పించని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా కల్పిస్తోందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిద్దవటం మండలం ఉప్పరపల్లెలో జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని రామయ్య ప్రారంభించారు. రామయ్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయ సాధనలో జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు.

February 27, 2026 / 05:16 PM IST

ఈ వారం OTTలోకి వచ్చేసిన చిత్రాలు

➠’హనీ’ – అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్స్ట్➠’ది బ్లఫ్’, ‘ఇక్కీస్’ – అమెజాన్ ప్రైమ్➠’హాట్‌స్పాట్ 2 మచ్’ – ఆహా➠’శ్రీ చిదంబరం గారు’ – ఈటీవీ విన్➠’రాస్లిన్: సీక్రెట్ స్టోరీ’ – జియో హాట్‌స్టార్➠’డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు కనబడుటలేదు'(వెబ్‌సిరీస్) – జీ5.

February 27, 2026 / 05:16 PM IST

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

KRNL: ఆస్పరి మండలం పుట్టకలమర్రి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనితకు సిటీ స్కాన్ అవసరమని డాక్టర్ చెప్పడంతో, మెరుగైన చికిత్సకు తక్షణ ఏర్పాట్లు చేస్తామని అయన హామీ ఇచ్చారు.

February 27, 2026 / 05:15 PM IST

పాల డైరీ కేంద్రాలను తనిఖీలు చేసిన అధికారులు

KRNL: ఎమ్మిగనూరులో పాల డైరీ కేంద్రాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక తిరుమల పాల డైరీ కేంద్రాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ పరిశీలించి పాల పాకెట్లు, పాలను ల్యాక్టోమీటర్‌తో పరీక్షించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో పాల శ్యాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.

February 27, 2026 / 05:15 PM IST

శస్త్ర చికిత్స కోసం LOC అందజేత

ASF: దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన అల్లి భాగ్యమ్మకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 75,000 LOC లెటర్‌ను MLA హరీష్ బాబు శుక్రవారం అందజేశారు. భాగ్యమ్మకి మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 27, 2026 / 05:15 PM IST