నంద్యాల: జిల్లా డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి వద్ద శుక్రవారం కారు క్రేన్ ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తిరుమల దర్శనం ముగించి కర్నూలు వైపు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే మృతి చెందారు. ప్రదీప్ తీవ్రంగా గాయపడి స్థానికులు ఆసుపత్రికి తరిలించారు.
NLG: చిట్యాల మండలం ఎలికట్టే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు NMMS ఫలితాలలో ఘనవిజయం సాధించారు. పాఠశాలకు చెందిన పి.హరిణి, ఎస్.కావ్యశ్రీ ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు హెచ్ఎం నర్సింహా తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు రాంభూపాల్, రవి, పి.వెంకన్న, బి.రామ్మోహన్, డి.వెంకన్న, ఎ.దుర్గయ్య, పి.వెంకన్న అభినందించారు.
ATP: అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నసీరుద్దీన్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. గుండెపోటుతో మరణించిన ఆయన కుటుంబానికి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా సిబ్బంది రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐ రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.
ASR: పులి కదలికలను రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్ పరిధిలోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాల్లో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
SRD: పటాన్ చెరువులో 300 కోట్ల CSR నిధుల ‘సూపర్ స్పెషాలిటీ హాస్పటల్’కు దివంగత డాక్టర్ కిషన్ రావు పేరుపెట్టాలని పారిశ్రామిక ప్రాంత మేధావుల బృందం సభ్యులతో పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి పంపించిన లెటర్ తన చేరిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వెంటనే రాష్ట్ర వైద్య విధాన పరిషత్తుకు పంపిస్తున్నట్ల కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి విజ్ఞాపనలు వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 7,550 నుంచి రూ. 7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ. 7,550 పలికింది.
SRCL: చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి అని వేములవాడ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. పోరాట వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95 వర్ధంతి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
శరీర భాగాల ఆకృతిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్ద చెవులు ఉన్నవారు ఆత్మవిశ్వాసం, నిజాయితీ కలిగి ఉండి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని వివరిస్తున్నారు. చిన్న చెవులు ఉన్నవారు లోతైన ఆలోచనాపరులై, క్రమశిక్షణతో లక్ష్యం వైపు దూసుకుపోతారని అంటున్నారు. ఇలా చెవుల ఆకృతిని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
RR: మొయినాబాద్లోని అంజనదేవి గార్డెన్లో ఇవాళ మొయినాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య, HYD మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ అభిరుద్దికి తమ వంతు సహకారం అందచేస్తామని అన్నారు.
CTR: వెదురుకుప్పం మండలం TKMపురంలో ఎమ్మెల్యే డా. థామస్ శనివారం పర్యటించనున్నట్లు MLA కార్యాలయం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అర్హులందరికీ ఎమ్మెల్యే పెన్షన్ నగదు అందజేయనున్నారు.
PDPL: అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సందర్శించారు. ఎండ తీవ్రతలో పని చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేతనాల చెల్లింపులు, పనుల నిర్వహణపై ఆరా తీశారు. మహిళా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ఉచితంగా పంపిణీ చేయనుంది. ఏపీలో సీఎం చంద్రబాబు, TGలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభిస్తారు. బాలికల వయస్సును ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారిస్తారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేయనున్నారు.
NRML: గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి తొడసం శంభు అన్నారు. కడెం మండలంలోని పాత రేవాజిపేట గ్రామాన్ని సందర్శించి నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని కమిటీ నాయకులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటం చేయడం కోసం సిద్ధం కావాలన్నారు.
VSP: మహిళలు, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని ఐద్వా డిమాండ్ చేసింది. శుక్రవారం జగదాంబ జంక్షన్లో జరిగిన ప్రెస్మీట్లో రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ.. నేరాలకు మద్యం,గంజాయి, డ్రగ్సే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ నెలలోనే 18కిపైగా ఘోరాలు జరిగాయని తెలిపారు. గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.