నంద్యాల: జిల్లా డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి వద్ద శుక్రవారం కారు క్రేన్ ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తిరుమల దర్శనం ముగించి కర్నూలు వైపు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే మృతి చెందారు. ప్రదీప్ తీవ్రంగా గాయపడి స్థానికులు ఆసుపత్రికి తరిలించారు.