ATP: అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నసీరుద్దీన్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. గుండెపోటుతో మరణించిన ఆయన కుటుంబానికి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా సిబ్బంది రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐ రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.