KMM: నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రోగులను వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీ నుంచి నుండి 19వ తేదీ వరకు మండలంలోని పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. 16, 17వ తేదీలలో ఒక బ్యాచ్ సభ్యులకు 18, 19వ మరొక బ్యాచ్ సభ్యులకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
TG: మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్కు వెళ్లిన మంచు మనోజ్ భార్యతో కలిసి శివధర్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కంప్లైంట్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి సమర్పించారు. అంతేకాకుండా గత ఆదివారం పది మంది వ్యక్తులు.. తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని కంప్లై...
ASR: అరకు సీడాప్ స్కిల్ కళాశాల విద్యార్ధులు ఇటీవలే పాల్గొన్న స్కైప్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిలో 10 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ వర్మ తెలిపారు. ఈ అపాయింట్మెంట్ లెటర్లను స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ PSN మూర్తి విద్యార్ధులకు అందించారు. నోవోటెల్ 8 మందికి, రాడిసన్ బ్లూ హోటల్ ఇద్దరకు ఆఫర్ లెటర్లు ఇచ్చామన్నారు.
ADB: ఉట్నూర్ పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్ల నియామకంపై మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరణి రాజేష్, బాబా శ్యాం టైగర్, కాంగ్రెస్ అధ్యక్షులు ఖయ్యూం ఉన్నారు.
నాగ చైతన్య- కార్తిక్ వర్మ దండు కాంబినేషన్లో రాబోతున్న సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని అనుకున్న మేకర్స్ తాజాగా హైపర్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర బ...
KMM: సత్తుపల్లి మండల పరిధిలో జరుగుతున్న హైవే రోడ్డు నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ నేత దయానంద్ సింగరేణి అధికారులను కోరారు. మంగళవారం రేచర్ల, లింగపాలెం రైతులతో కలిసి సింగరేణి పిఓను కలిసి వినతి పత్రం అందించారు. హైవేలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదని, తక్షణమే వారికి పరిహారం అందే విధంగా చూడాలని అధికారులను కోరారు.
కోనసీమ: అంబాజీపేట మండలంలోని ఇరుసముండ గ్రామంలో రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో అంబాజీపేట మండలం తహసీల్దార్ వెంకటేశ్వరి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉండకూడదని, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు.
KKD: ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్క అని కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రి వారి మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డును ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఫ్యామిలీ కార్డు వల్ల మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు మరింత చేరువ అయ్యేందుకు ఎంతో దోహద పడతాయన్నారు. కుటుంబ సంరక్షణను, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఫ్యామిలీ కార్డ్ ఒక ముందడుగని తెలిపారు.
NLG: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తిప్పర్తి మండల కేంద్రానికి జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కళాశాల ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఆదర్శ పాఠశాల సమీపంలో స్థలాన్ని సర్వే చేసి నివేదికను అందజేయాలని తహసీల్దార్ స్వప్నను ఆదేశించారు. ఆమె వెంట తాహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతని మార్కెట్ విలువపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ల కంటే 2024 ప్రథమార్ధంలో అత్యధిక బ్రాండ్లకు ఎండోర్స్మెంట్ చేస్తున్న వ్యక్తిగా ధోనీ నిలిచాడు. ఈ మేరకు ‘TAM మీడియా రిసెర్చ్’ నివేదిక విడుదల చేసింది. ధోనీ 42 బ్రాండ్లతో మొదటి స్థానంలో ఉండగా.. అమితాబ్ (...
TPT: నాగలాపురం-చిన్న పాండూరు (వయా టీపీ కోట) రోడ్డు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. మంగళవారం నాగలాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు. అవసరమైతే టీపీకోట రోడ్డు ఆవశ్యకతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళి పనులు చేపట్టడానికి కృషి చేస్తానన్నారు.
ELR: జిల్లాలో వేరు వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న 4 ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప కిషోర్ మాట్లాడుతూ.. నిందితుల వద్ద 70 లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాల విశ్లేషణలో జిల్లా పోలీస్ టీమ్ చాలా బాగా పనిచేస్తుందన్నారు. ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
TG: తెలంగాణ విద్యార్థి బీసీ సంఘం ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ముట్టడి చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకొని.. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.