AKP: ఇటీవల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన మోడల్ టెస్ట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ బహుమతులు ప్రకటించింది. ఎస్ రాయవరం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం డిప్యూటీ డీఈవో అప్పారావు చేతుల మీదగా 11 మందికి బహుమతులు అందజేసినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం బాలాజీ తెలిపారు. పరీక్షలపై భయం పోగొట్టేందుకు మోడల్ టెస్ట్ నిర్వహించమన్నారు.