KRNL: ఆస్పరి మండలం పుట్టకలమర్రి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనితకు సిటీ స్కాన్ అవసరమని డాక్టర్ చెప్పడంతో, మెరుగైన చికిత్సకు తక్షణ ఏర్పాట్లు చేస్తామని అయన హామీ ఇచ్చారు.