• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘కర్నూలు మండల అభివృద్ధి కోసం పోరాడదాం’

కర్నూలు: అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డీ.గౌస్ దేశాయ్ అన్నారు. సీపీఎం కర్నూల్ మండలం మూడో మహాసభలు గొందిపర్లలోని వసంత నగర్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రైల్వే వ్యాగన్ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదన్నారు.

December 10, 2024 / 05:29 PM IST

నంద్యాల-నందిపల్లె రైల్వే స్టేషన్ల మధ్య వ్యక్తి మృతి

నంద్యాల-నందిపల్లె రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియ రాలేదన్నారు. మృతుడు పసుపు, తెల్లని రంగు ఫుల్ హాండ్స్ టీ షర్టు, ఎరుపు, పసుపు కలర్ షార్ట్ ధరించినట్లు చెప్పారు.

December 10, 2024 / 05:28 PM IST

అనాథ పిల్లల పాఠశాలకు రూ.10 లక్షల విరాళం

NDL: ఓర్వకల్లు ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ పిల్లల పాఠశాలకు మంగళవారం తానా ఫౌండేషన్ సహకారంతో రూ. 10 లక్షల సహకారాన్ని నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయ భారతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర రెడ్డి, తానా సభ్యులు రవి, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 05:27 PM IST

‘తెలంగాణ పై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి’

HYD: తెలంగాణపై సోషిల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

December 10, 2024 / 05:26 PM IST

తొలగించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అధికారులు

ATP: గుంతకల్లు పట్టణంలోని ప్రధాన సర్కిల్లో ఈనెల 12న జరిగే హనుమత్ వ్రత్ ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ అధికారులు ఈనెల 8న తొలగించారు. దీంతో దీక్షాపరులు మున్సిపాలిటీ అధికారులతో వాగ్వివాదానికి దిగి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో మంగళవారం నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

December 10, 2024 / 05:26 PM IST

‘అన్నమాచార్య విద్యాసంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదు’

KDP: విద్యాసంస్థల మాటునా భూ దోపిడి చేస్తూ, చెరువులను స్వాహా చేస్తున్న రాజంపేట అన్నమాచార్య విద్యాసంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, TNSF జిల్లా అధ్యక్షుడు పోలి శివకుమార్ తెలిపారు. మంగళవారం రాజంపేటలో వారు మాట్లాడుతూ.. చెరువు తొట్టిలను కబ్జా చేసి భవనాలు నిర్మించారని ఆరోపించారు.

December 10, 2024 / 05:25 PM IST

ఈ పంట నమోదు తప్పనిసరి

ప్రకాశం: ఈ పంట నమోదు తప్పని సరిగా చేయించుకోవాలని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ అన్నారు. మనికేశ్వరం మరియు కొంగపాడు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15 లోపు అందరూ పంటల భీమా చేయించుకోవాలని అన్నారు.

December 10, 2024 / 05:24 PM IST

సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు!

సిరియాలో ఇజ్రాయెల్ పెద్దఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. అదేవిధంగా.. సిరియాలోకి ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకుని వెళ్తున్నట్లు సమాచారం. సిరియా రాజధాని డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు పేర్కొంది.

December 10, 2024 / 05:24 PM IST

పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా నిర్వహించాలి

VZM: అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను మరింత పటిష్టంగా నిర్వహించాలని మంగళవారం మధ్యాహ్నం గంట్యాడలో ఐసీడీఎస్ పీవో ఉమాభారతి ఆదేశించారు. గంట్యాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిగింది. బాల్య వివాహాలు జరగకుండా నిరోధించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

December 10, 2024 / 05:24 PM IST

గృహహింస చట్టం ప్రాముఖ్యతను తెలియజేసిన సీనియర్ సివిల్ జడ్జి

NZB: సదాశివ్ నగర్ చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో చట్టాలపై మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గృహహింస, బాల్యవివాహాల నిర్మూలన చట్టాలపైన అవగాహన కల్పించారు. ప్రతినిధులు షేక్ అలీమ్, అబ్దుల్ లతీఫ్, ఐకెపి ఎపిఎం రాజిరెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

December 10, 2024 / 05:23 PM IST

‘రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు వైద్య పరీక్ష చేయించుకోవాలి’

TPT: రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మహిళలు మామోగ్రామ్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్విమ్స్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య భాను సూచించారు. మంగళవారం రాజగోపాలపురం, పీవీ పురం గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్ష శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపాండూరు వైద్యాధికారి డాక్టర్ అనిత, గ్రామ సర్పంచులు మధుసూదన్ రావు, పోలమ్మ పాల్గొన్నారు.

December 10, 2024 / 05:22 PM IST

‘వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్‌లోకి కలుపొద్దు’

KNR: మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నట్లు ఆర్డర్ వెలుపడగా, మంగళవారం ఆలయాన్ని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని పరిశీలించి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆలయాన్ని ఎండోమెంట్లోకి పరిగణించవద్దని అధికారులను అడ్డుకున్నారు.

December 10, 2024 / 05:22 PM IST

రాజంపేటలో కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌కు స్టాపింగ్

అన్నమయ్య: జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేశ్ కృషితో రాజంపేటలో కన్యాకుమారి స్టాపింగ్ వచ్చిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ అన్నారు. ఒక రోజు ముందే మంగళవారం ట్రయిల్ కోసం రాజంపేటలో ట్రైన్ ఆగిందని ఆయన తెలిపారు. రైల్వే మంత్రి, సికింద్రాబాద్ రైల్వే నిలయం మేనేజర్ పద్మజను కలిసి లోకేశ్ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఆయన కృషి ఫలించిందని చెప్పారు.

December 10, 2024 / 05:22 PM IST

‘ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు’

ATP: రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు గ్రామపంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భారీగా భూ అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

December 10, 2024 / 05:21 PM IST

వివక్ష లేని సమాజం కోసం కృషి చేద్దాం

NLR: స్వేచ్ఛ స్వతంత్రంగా బ్రతకడం ప్రతి మనిషి జన్మహక్కు అని ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న అన్నారు. కావలి పట్టణంలోని ముసునూరు చంద్రబాబు నగర్ అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పై మహిళలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. జాతి, రంగు, మతం, లింగం, భాష, రాజకీయ తేడా లేకుండా అందరూ సమాన హక్కులతో జీవించాలన్నారు.

December 10, 2024 / 05:19 PM IST