MNCL: యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సుదమల్ల ఆశిష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖకు, తనకు ఓటు వేసిన యువతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆశిష 4062 ఓట్లు సాధించింది.
VZM: నేరాలను నియంత్రించుటలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ సందర్బంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై 459, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 179 కేసులు నమోదు చేశామని తెలిపారు. అర్ధ రాత్రుళ్ళు సహేతుకరమైన కారణాలు లేకుండా తిరిగిన వారిపై 254 కేసులు నమోదు చేసామన్నారు.
AP: మంత్రి పయ్యావుల కేశవ్ నంద్యాలలో పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం చంద్రబాబు బ్రాండ్ కనపడుతోందన్నారు. జగన్ డ్యామేజ్ చేసిన ఏపీని గాడిలో పెట్టామన్నారు. నంద్యాల జిల్లాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు.
KDP: రెవిన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తుందని బద్వేల్ టీడీపీ నియోజకవర్గపు సమన్వయకర్త రితిష్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నాయపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామం పరిధిలోని వివిధ రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.
NLR: అల్లూరు మండలంలోని సింగపేట గ్రామంలో మంగళవారం రెవిన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెవెన్యూ సదస్సులో రైతుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. సర్వే సంబంధిత సమస్యలు అనగా 1B, అడంగల్లో పేర్లు మార్పులు, పొలం సరిహద్దు సమస్యలు తదితర సమస్యలు ఈ సమావేశంలో అధికారుల దృష్టికి వచ్చాయి. దాదాపుగా మొత్తం 75 అర్జీలను స్వీకరించారు.
SKLM: రైతు సమస్యలు పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిపేట గ్రామంలో ఎమ్మార్వో రాంబాబు ఆదేశాలు మేరకు రెవెన్యూ సదస్సు నిర్వహించమన్నారు. రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులుకు ఉపాధ్యాయులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. టీచర్లపై యాప్ల భారాన్ని తగ్గించాలన్నారు. పని వేళల పెంపు సరికాదన్నారు. మండల విద్యాశాఖ అధికారులు సెలవు సైతం ఇవ్వడం లేదని తెలిపారు
BPT: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. భట్టిప్రోలు ఆర్యవైశ్య కల్యాణ మండపం నందు మంగళవారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీఎం ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.
ELR: ఏలూరు సత్రంపాడులోని జూనియర్ కళాశాల నందు మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం స్థాపించబడిందన్నారు. మానవ అభివృద్ధికి ఈ చట్టం ఒక మైలురాయ వంటిదని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రధానమన్నారు.
VZM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి టివి రాజేష్ కుమార్, 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
TG: నటుడు మోహన్ బాబుకు చెందిన హైదరాబాద్లోని ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. మనోజ్ సామగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచారు. మూడు వాహనాల్లో సామగ్రిని తరలించనున్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మనోజ్ తన ఇంటికి రావద్దని మోహన్ బాబు అన్నట్లు తెలుస్తుంది.
SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాలకు 108 నూతన వాహనాలను మంగళవారం ఎమ్మెల్యే సామేలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి: ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని IDOCలో ట్రెజరీ కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు రక్తదానం చేయాలని సూచించారు. అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, టీజీవో కార్యదర్శి సాయి రెడ్డి పాల్గొన్నారు.
TG: హైదరాబాద్లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 600 గ్రాముల డ్రగ్స్ను మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లాలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ జరపాలని సూచించారు.