• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9052548047, 8008949107 నంబర్లలో సంప్రదించాలన్నారు.

March 1, 2026 / 11:46 AM IST

BREAKING: ట్రంప్ మరో తీవ్ర హెచ్చరిక

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిదని సూచించారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇరాన్ కూడా అమెరికాపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

March 1, 2026 / 11:46 AM IST

జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ATP: జిల్లాలో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. ఆదివారం ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

March 1, 2026 / 11:45 AM IST

ఈనెల 4 నుంచి అంబేద్కర్ వర్సిటీ ప్రాక్టికల్స్

మహబూబ్‌నగర్ MVS డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ నెల 4 నుంచి 3వ సెమిస్టర్ సైన్స్, కంప్యూటర్స్ ప్రయోగ తరగతులు ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న వారినే అనుమతిస్తామని ప్రిన్సిపల్ డా. కే. పద్మావతి తెలిపారు. ఇతర వివరాలకు 7382929609 నంబర్ సంప్రదించాలని కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు.

March 1, 2026 / 11:44 AM IST

ముల్కనూరులో మాదిగ అమరవీరులకు నివాళి..

HNK: ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, మాదిగ అమరవీరుల ఆశయసాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.

March 1, 2026 / 11:43 AM IST

యాదగిరిగుట్ట దేవస్థానం ఈనెల 3న మూసివేత

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7:00 వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించి, ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. మరుసటి రోజు 4న ఉదయం 3:30 నుంచి సంప్రోక్షణ నిర్వహించి నిత్య కైంకార్యాలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హోలీ ఉత్సవం ముందు రోజు నిర్వహిస్తున్నారు.

March 1, 2026 / 11:42 AM IST

విమాన రాకపోకలకు అంతరాయం

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, దోహా, కువైట్, సౌదీఅరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 21 విమానాలను రద్దు చేశారు.

March 1, 2026 / 11:42 AM IST

హాస్పిటల్‌కు వెళ్లి పింఛన్ అందజేత

శ్రీకాకుళం: టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అన్నెపు ప్రకాశరావు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీ జి. యశోదకృష్ణ హాస్పిటల్‌కు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

March 1, 2026 / 11:40 AM IST

డ్రైనేజీ పనులను ప్రారంభం

MLG: వెంకటాపూర్ రామానుజాపూర్లో ఇవాళ నూతన డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్క, DCC జిల్లా అధ్యక్షులు అశోక్ సూచనల మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

March 1, 2026 / 11:38 AM IST

రేపు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం

ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు.

March 1, 2026 / 11:38 AM IST

మాదిగ అమరవీరుల దినోత్సవం

SDPT: మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కూడలిలో కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

March 1, 2026 / 11:37 AM IST

న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోంది: సీజేఐ

AP: తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచికం అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోంది. నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

March 1, 2026 / 11:37 AM IST

వీటిని రోజూ వాడుతున్నారా?

అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రొడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయని నిపుణులు అంటున్నారు. వాటర్‌ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్‌ రోజూ వాడితే కేశాల్లోని PH స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది.

March 1, 2026 / 11:36 AM IST

వరంగల్ ట్రైసిటీలో సిండికేట్ దందా

వరంగల్ ట్రైసిటీలోని చికెన్ షాపుల వ్యర్థాల సేకరణ, తరలింపు వ్యవహారాల్లో సిండికేట్ దందా కొనసాగుతోందని సమాచారం. HNKకు చెందిన ఓ లీడర్ ఈ సిండికేట్‌కు బాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 3 వేల చికెన్ షాపుల నుంచి రోజుకు లక్షన్నర KGల వ్యర్థాలను సేకరించి, చేపల దాణాగా APకి తరలిస్తున్నారు. తక్కువ ధరకు టెండర్లు దక్కించుకుని ఎక్కువ లాభాలు పొందుతున్నట్లు సమాచారం

March 1, 2026 / 11:35 AM IST

లింగాపురంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

NDL: బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో ఆదివారం ఎస్సై జగన్మోహన్ పోలీస్ సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో అనుమానిత బెల్ట్ షాపు నడిపేవారి ఇళ్ళు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ప్రజలతో సమావేశం నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు.

March 1, 2026 / 11:33 AM IST