• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న గ్రామస్తులు

E.G: సఖినేటిపల్లిలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా కొంతమందిని హిందూ పరిరక్షణ సమితి సభ్యులు పోలిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తుల అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేసి గోవులను వారికి అప్పగించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలిపారు. ఆవులను అంతర్వేది గోశాలకు తరలించారు.

December 10, 2024 / 06:01 PM IST

సంతమాగులూరులో శిక్షణా తరగతులు

ప్రకాశం: LSDG ట్రైనింగ్‌లో భాగంగా సంతమాగులూరు మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శివప్రసాద్‌తో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ గురించి వివరించారు.

December 10, 2024 / 06:01 PM IST

ఎంపీడీవో కార్యాలయంలో ట్రైనింగ్ ప్రాగ్రాం నిర్వహణ

PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ మజ్జి శోభారాణి అధ్యక్షతన ఎంపీడీవో రూపేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్ఎస్ డిజి ఈ కార్యక్రమం 10 నుండి 13వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు.

December 10, 2024 / 06:01 PM IST

నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

కృష్ణా: తిరువూరు మండలంలోని కాకర్లలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 35 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్సై వి. కృష్ణవేణి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి తండాకి చెందిన బాణావత్ వినోద్ కుమార్ బైక్ పై అక్రమంగా సారా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

December 10, 2024 / 06:01 PM IST

తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

కడప: విధుల్లో చేరకుండా ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన తహశీల్దార్ దస్తగిరయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా నుండి జమ్మలమడుగు కెఆర్‌ఆర్‌సి తాహశీీల్దారుగా బదిలీ అయి, ఇంతవరకు విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

December 10, 2024 / 06:00 PM IST

పీయూలో ABVP రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

MBNR: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ నెల 23, 24, 25 తేదీలలో జరగనున్న 43వ రాష్ట్ర మహాసభల పోస్టర్ జాతీయ కార్యవర్గ సభ్యులు కాయం నవేంద్ర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.

December 10, 2024 / 06:00 PM IST

కానిస్టేబుల్ కుటుంబాలకు అండగా నిలుస్తాం: అదనపు ఎస్పీ

PLD: మరణించిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున మంగళవారం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జెవి సంతోష్ ఆర్థిక సహాయం అందించారు. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్యాం ప్రసాద్, కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయాన్ని భవిష్యత్తులోనూ చేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.

December 10, 2024 / 06:00 PM IST

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

BHNG: భువనగిరి పట్టణంలోని సంతోష్ నగర్ వార్డు 5లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ హనుమంత రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్న తీరును గమనించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తూ చేయాలన్నారు.

December 10, 2024 / 05:59 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలి: రఘువీర్

NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలను మార్చడం కాదని.. ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని బీజీపీ జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

December 10, 2024 / 05:59 PM IST

ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం

BHNG: ప్రగతిశీల యువజన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సాధన శ్రీకాంత్ అధ్యక్షతన భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు ఎండమావిగా మారాయని అన్నారు.

December 10, 2024 / 05:57 PM IST

గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

NRML: గ్రూప్ 2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ఆమె అధికారులతో సమావేశం  నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్-2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

December 10, 2024 / 05:56 PM IST

ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

VZM: ఈ నెల 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి యొక్క ఆదేశాలు మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్ ఉమ్మడి జిల్లాలో వున్నా న్యాయమూర్తులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులకు శాశ్వత పరిస్కారం చేయాలన్నారు.

December 10, 2024 / 05:55 PM IST

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్

NLG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల12వ తేదీలోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు రాజకీయ పార్టీలకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నేడు మినీ మీటింగ్ హాల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించారు.

December 10, 2024 / 05:55 PM IST

‘సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి’

JGL: ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్ పెల్లి సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్‌ల మోసాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై మంగళవారం అవగాహన కల్పించారు.

December 10, 2024 / 05:54 PM IST

ట్విట్టర్‌లో సాయం కోరిన కోడుమూరు వాసి.. స్పందించిన లోకేశ్

కర్నూలు: కోడుమూరు టీడీపీ కార్యకర్తకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ITDP మండల అధ్యక్షుడైన రవిశంకర్ తన పండంటి కుమారుడికి శ్వాసకోస ఇబ్బంది ఉండటంతో విజయవాడ AIIMSలో చేర్పించారు. చికిత్సకి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని, సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా లోకేశ్‌ను కోరారు. స్పందించిన ఆయన ‘నా టీమ్ మీతో మాట్లాడి అవసరమైన సాయం చేస్తుంది’ అని హామీ ఇచ్చరు.

December 10, 2024 / 05:54 PM IST