BHNG: ప్రగతిశీల యువజన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సాధన శ్రీకాంత్ అధ్యక్షతన భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు ఎండమావిగా మారాయని అన్నారు.