KRNL: జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకిగాను మే 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ సాధికారిత అధికారిణి తులసీదేవి బుధవారం తెలిపారు. ఆలూరు, కర్నూలు, తుగ్గలిలో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.