MBNR: ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మహబూబ్ నగర్ మాజీ పురపాలక చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని కుమ్మరివాడిలో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు.