PPM: సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం మున్సిపల్ కమీషనర్ సీ.హెచ్.వేంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని వీధి దీపాలపై ఫిర్యాదు అందిన తక్షణం మరమతులు నిర్వహించి దీపాలు వెలిగేటట్లుగా చేయడం జరుగుతుందన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణంపై ఫిర్యాదుల మేరకు చేపడతామని చెప్పారు.