• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నవమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

BDK: భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

March 1, 2026 / 06:32 AM IST

డ్యామ్ నిర్మాణానికి రూ. 166.40 కోట్లు విడుదల

ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వర డ్యాం నిర్మాణానికి రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సంగమేశ్వర రిజర్వాయర్ ద్వారా కొండపి నియోజకవర్గంలో 9500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 25 కోట్లు కేటాయించారని అన్నారు.

March 1, 2026 / 06:31 AM IST

క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే

ATP: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన ఈ లీగ్‌లో ఆయన సందడి చేస్తున్నారు. ఏపీ పొలిటికల్ లయన్స్ జట్టుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సారథ్యం వహిస్తున్నారు.

March 1, 2026 / 06:31 AM IST

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: SP

KRNL: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ 1,536, హెల్మెట్ లేకుండా 1,388, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 392, ట్రిపుల్ రైడింగ్ 63 కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు.

March 1, 2026 / 06:29 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

KMM: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలించి పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలకాలని కోరారు.

March 1, 2026 / 06:29 AM IST

గద్దర్ విగ్రహావిష్కరణకు గోడపత్రిక ఆవిష్కరణ

NGKL: కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 8న ప్రజా గాయకుడు విగ్రహం ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆవిష్కరణకు సంబంధించి గోడపత్రికను మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల శనివారం రాత్రి ఆవిష్కరించారు. గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ కన్వీనర్ లక్ష్మణ శర్మ, సభ్యులు రజిత, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:29 AM IST

నేడు పామూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాయబ్ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పామూరులోని పాత స్టేట్ బ్యాంకు రోడ్డు, కరెంట్ ఆఫీస్ కాలనీ, ఇరువురు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 1, 2026 / 06:28 AM IST

బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీని శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామమైన మంత్రజోల గ్రామస్తుల కలిసి తమ గ్రామానికి BT రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. డోలిమోత గ్రామంగా గుర్తించి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసిందని, ఆయితే ఆటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో చివరి దశలో రోడ్డు పనులు ఆగిపోయాయని వాపోయారు.

March 1, 2026 / 06:28 AM IST

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి: హుస్సేన్

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో విద్యార్థిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ డిమాండ్ చేశారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ… అధికారుల అండదండలతోనే పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరించారు.

March 1, 2026 / 06:27 AM IST

ఘనంగా పోలీస్ సిబ్బంది వీడ్కోలు సభ

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది వీడ్కోలు సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటివరకు వీరంతా విధి నిర్వహణలో నిరంతరాయంగా మీతో గడిపే సమయం కూడా లేకుండా విధుల్లో నిమగ్నం అయ్యారని, విరమణ అనంతరం వారికి ప్రశాంత జీవితం అందజేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని తెలిపారు.

March 1, 2026 / 06:26 AM IST

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

GNTR: తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి (55) మృతి చెందాడు. హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు దాటుతున్న సమయంలో అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి జీఆర్‌పీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 06:26 AM IST

రేపు కాలేశ్వరంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 2న స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ EO మహేష్ తెలిపారు. ఉదయం 10:30 గం శుభానంద ముక్తేశ్వర ప్రధాన ఉత్సవ మూర్తులకు ఈ వేడుక జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని EO కోరారు.

March 1, 2026 / 06:24 AM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

నంద్యాల: TDP కార్యాలయంలో మంత్రి ఫారూఖ్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వం దృష్టికి వెళ్లవలసిన సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 06:24 AM IST

జీవితం సైన్స్ తో ముడిపడి ఉంది: డాక్టర్ తాహెర్

GDWL: మనిషి జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని రెడ్ క్రాస్ సొసైటీ గద్వాల జిల్లా వైస్ ఛైర్మన్ డాక్టర్ తాహెర్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినాన్ని శనివారం అయిజలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక దశ నుంచి సైన్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు.

March 1, 2026 / 06:23 AM IST

దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించిన పోలీసులు

BPT: వెదుళ్లపల్లిలో జరిగిన ఇనుప గేట్ల చోరీ కేసును ఎస్సై భాగ్యరాజు ఛేదించారు. ఫిబ్రవరి 12న వెంకటేశ్వరరెడ్డి ఇంటి వద్ద చోరీకి గురైన రెండు గేట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం గుర్తించారు. ఈ చోరీకి పాల్పడిన A1 సంగీత రంజిత్ కుమార్, A2 ఆసోడి సాయిబాబులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

March 1, 2026 / 06:23 AM IST