SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే సామేలు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాలను, రికార్డులను పరిశీలించారు.