ATP: నగరంలోని స్థానిక లోకదాలత్ హాల్ నందు మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ శివ ప్రసాద్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు అధికారులకు అనుసరించవలసిన న్యాయపరమైన విధానాల గురించి వివరించారు.