NRML: తండ్రిని చంపిన కొడుకును అరెస్టు చేసిన ఘటన మంగళవారం నిర్మల్లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరాల మేరకు శనివారం నిర్మల్ మండలం మూటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మణిదీప్ తన తండ్రిని గొంతు నులిమి చంపివేయగా, మృతుడి సోదరుడు రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గ్రామీణ సీఐ రామకృష్ణ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసినట్టు తెలిపారు.