సత్యసాయి: గోరంట్ల మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 80 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. నార్సింపల్లి పంచాయతీ ఎర్రపల్లికి చెందిన వైసీపీ నాయకుడు పద్మనాభం రెడ్డి, ఎంపీటీసీ తిప్పమ్మతో పాటు మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సవిత వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.