• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

TG: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనం జప్తు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 10, 2024 / 07:30 PM IST

ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్

GDWL: ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ -2 పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు మంగళవారం సూచించారు. 2 పరీక్షలు 2 రోజులపాటు 4 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు.

December 10, 2024 / 07:30 PM IST

రేపు కలెక్టర్ల సదస్సుకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

KRNL: వెలగపూడిలోని సచివాలయంలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు CM చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌‌కు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పీ.రంజిత్ బాషా, జీ.రాజకుమారి హాజరుకానున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తదితర అంశాలపై CM దిశా నిర్దేశం చేయనున్నారు.

December 10, 2024 / 07:29 PM IST

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం: మాజీ ఎమ్మెల్యే

NDL: గృహిణులకు, నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డోన్ యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆర్&బి అతిథి గృహంలో మహిళలకు ఉపాధి సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధి లేని మహిళలందరికీ ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 10, 2024 / 07:24 PM IST

దారుణం: స్కానింగ్ కోసం వస్తే.. దుస్తులు విప్పి..

AP: విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. విశాఖకు చెందిన మహిళ నిన్న రాత్రి తలకు గాయమై స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ దుస్తులు తీయాలని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

December 10, 2024 / 07:24 PM IST

జిల్లాలో 56 మంది అరెస్ట్: ఎస్పీ

VZM: జిల్లాలో గత వారం రోజుల్లో అసాంఘిక కార్యకలపాలపై నమోదు చేసిన కేసుల వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. పేకాట, కోడి పందాలు ఆడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి, 56 మందిని అరెస్టుచేసి, వారి వద్ద నుండి రూ.86,134 నగదు, 5 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం కలిగిన వారిపై 14 కేసులు నమోదు చేసి, 14మందిని అరెస్టు చేశామన్నారు.

December 10, 2024 / 07:22 PM IST

డిసెంబర్‌ 17 నుంచి శ్రీవారిక తిరుప్పావై

AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమై ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.

December 10, 2024 / 07:18 PM IST

డిసెంబర్‌ 17 నుంచి శ్రీవారికి తిరుప్పావై

AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.

December 10, 2024 / 07:18 PM IST

ఎడ్లబండితో ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా

KMM: మధిర పట్టణంలో ఎడ్లబండితో ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మండల అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే మండల అధికారులు స్పందించి ఎడ్లబండితో అక్రమంగా తీసుకు రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

December 10, 2024 / 07:14 PM IST

సంకల్ప రథంతో ప్రజలకు అవగాహన

VZM: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చేందుకు సంకల్ప రథంతో పట్టణంలోని జొన్నగుడ్డి, రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, మాదక ద్రవ్యాల వినియోగం వలన తమ జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా చిత్రం అవుతున్నాయో వివరిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు.

December 10, 2024 / 07:14 PM IST

‘గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి’

కోనసీమ: రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈనెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని మాజీ MLA జగ్గీరెడ్డి కోరారు. ‘అన్నదాతకు అండగా వైఎస్ఆర్‌సీపీ’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను రావులపాలెం YCP కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.

December 10, 2024 / 07:13 PM IST

అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రత్తిపాటి వినతి

PLD: చిలకలూరిపేట నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రికి అవసరమైన సిబ్బంది, పరికరాల ఏర్పాటు, అత్యాధునిక వసతులకు నిధులు మంజూరు చేసి సహకారం అందించాలని కోరారు.

December 10, 2024 / 07:12 PM IST

ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వినతి

సిరిసిల్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్యాధికారికి వసంతరావుకు వినతిపత్రం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు పాటించని ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

December 10, 2024 / 07:11 PM IST

‘లైంగిక దాడి ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

KMM: రఘునాధపాలెంలో ఒంటరి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

December 10, 2024 / 07:10 PM IST

జవాబుదారీగా ఉండాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం: భట్టి

AP: ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 10, 2024 / 07:10 PM IST