• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన సీఐ

కృష్ణా: గుడివాడలో విద్యార్థులకు టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ ఓపెన్ హౌస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫిర్యాదు (Complaint) అంటే ఏమిటి, ఎఫ్‌ఐఆర్ (FIR) అంటే ఏమిటి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసే విధానం, తదనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేసే ప్రక్రియ వంటి అంశాల గురించి వివరించారు.

February 28, 2026 / 07:47 PM IST

వేట్లపాలెం ఘటనపై రేవంత్ విచారం

TG: ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు సహాకారం అందించాలని పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనలో 23 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటంబాలకు కేంద్రం రూ. 2 లక్షలు ప్రకటించింది.

February 28, 2026 / 07:47 PM IST

‘దోమల నివారణకు తగు చర్యలు తీసుకోండి’

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో దోమల బెడదా తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజు.. దోమలు కుట్టి టైఫాయిడ్, మలేరియా ఇతర అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొన్నారు. దయచేసి గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ స్పందించి వెంటనే దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 07:45 PM IST

ఫైరింజన్లు రాలేక.. పెరిగిన ప్రమాద తీవ్రత?

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన అందరినీ కలచివేసింది. అయితే, బాణాసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడికి ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. చివరికి ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించే ప్రాంతానికి చేరుకునే సరికే చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

February 28, 2026 / 07:45 PM IST

గద్వాల్ రైల్వే పార్కింగ్‌లో అక్రమ వసూళ్లు..?

GDWL: గద్వాల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజువారీ ఛార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని వాహనదారులు అంటున్నారు. 24 గంటల పార్కింగ్‌కు రూ.32 ఉండగా రూ.60 తీసుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.

February 28, 2026 / 07:45 PM IST

మిషన్ భగీరథ నీటి పునరుద్ధరణ

MBNR: జడ్చర్ల మండలం బోయలకుంటలో గత నెలలో బీటీ రోడ్డు ఏర్పాటు సందర్భంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసమయ్యింది. విషయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రూ.2 లక్షలు డీఎన్ఎఫ్టీ నిధులు మంజూరు చేశారు. నూతన పైపులైన్ పనులు పూర్తి కావడంతో శనివారం సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ పూజలు నిర్వహించి మిషన్ భగీరథ నీటిని పునరుద్ధరించారు.

February 28, 2026 / 07:43 PM IST

గ్రహణం సందర్భంగా రామాలయం మూసివేత

KNR: ఇల్లందకుంట(M) కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని మార్చి 3, మంగళవారం చంద్ర గ్రహణం పురస్కరించుకుని మూసివేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈఓ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణ ప్రభావం దృష్ట్యా ఉదయం 7:00 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తామని వివరించారు. మరుసటి రోజు ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 10:00 గంటలకు భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు.

February 28, 2026 / 07:42 PM IST

కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై DSP స్పందన

నాగర్ కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మరణించిన ఘటనపై SMలో జరుగుతున్న ప్రచారాన్ని DSP బుర్రి శ్రీనివాస్ ఖండించారు. ఈ విషాద ఘటనకు కొందరు రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన ఆరోపించారు. అగ్రవర్ణాల వారు పాపను తన్నడం వల్లే మరణించిందన్న వార్తల్లో నిజం లేదని, అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు.

February 28, 2026 / 07:41 PM IST

యుద్ధం.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లన్నీ బంద్

దుబాయ్‌లోని విమానాశ్రయాలన్నీ మూసివేశామని, ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని అధికారులు సూచించారు. దుబాయ్ మీదుగా ఇతరదేశాలకు వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పలు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విమానాలకు అంతరాయం కలగవచ్చని ఉందని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

February 28, 2026 / 07:41 PM IST

‘అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి’

W.G: అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఫైర్‌ అధికారి ఐ. అజయ్‌కుమార్‌ అన్నారు. తణుకులోని సాయిశ్వేత ఆసుపత్రిలో శనివారం వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు రోగులను అత్యవసర మార్గాల్లో తరలించే విధానంపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

February 28, 2026 / 07:40 PM IST

‘పంచాయితీ ని అభివృద్ధి చేయడమే లక్ష్యం’

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హమాలీ కాలనీ సర్పంచ్ ప్రేమిందర్ నాయక్ రోజు రోజుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు పంచాయతీలో శనివారం నూతన వీధి దీపాలు ఏర్పాటు చేసి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీలో ఎలాంటి సమస్య ఉన్న ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

February 28, 2026 / 07:37 PM IST

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ ఎస్. సదానందం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఈ ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

February 28, 2026 / 07:34 PM IST

విద్యా కమిషన్ సిఫారసులపై TSUTF ఆందోళన

MLG: మంగపేట మండల కేంద్రంలో శనివారం TSUTF ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు హాజరై, మాట్లాడారు. ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన పేర్కొన్నారు. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసే ముందు ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్నారు.

February 28, 2026 / 07:33 PM IST

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి: మంత్రి వివేక్

MDK: మెదక్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ శనివారం సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మెదక్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రజా ప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవాలని కలెక్టర్‌కు సూచించారు.

February 28, 2026 / 07:32 PM IST

T20 WC: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 40* పరుగులు చేయడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ క్రమంలో గతంలో 319 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును, ఫర్హాన్ (323*) అధిగమించాడు.

February 28, 2026 / 07:32 PM IST