KMM: మధిర పట్టణంలో ఎడ్లబండితో ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మండల అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే మండల అధికారులు స్పందించి ఎడ్లబండితో అక్రమంగా తీసుకు రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
VZM: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చేందుకు సంకల్ప రథంతో పట్టణంలోని జొన్నగుడ్డి, రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, మాదక ద్రవ్యాల వినియోగం వలన తమ జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా చిత్రం అవుతున్నాయో వివరిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు.
కోనసీమ: రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈనెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని మాజీ MLA జగ్గీరెడ్డి కోరారు. ‘అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ’ పేరుతో రూపొందించిన పోస్టర్ను రావులపాలెం YCP కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.
PLD: చిలకలూరిపేట నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రికి అవసరమైన సిబ్బంది, పరికరాల ఏర్పాటు, అత్యాధునిక వసతులకు నిధులు మంజూరు చేసి సహకారం అందించాలని కోరారు.
సిరిసిల్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్యాధికారికి వసంతరావుకు వినతిపత్రం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు పాటించని ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KMM: రఘునాధపాలెంలో ఒంటరి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
AP: ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ. ఈ నేపథ్యంలోనే ‘నానా హైరానా’ సాంగ్ను న్యూజిలాండ్లో చిత్రీకరించారు. ఈ సాంగ్ క...
SKLM: ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ -2 సర్పంచ్ కృష్ణారావుకు 104 సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. తమకి నెల నెల జీతాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. దీనితో కుటుంబ పోషణ కష్టమవుతుందని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి సమీపన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు (బుధవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి మంగళవారం తెలిపారు. జాబ్ మేళకు 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతీ యువకులు తమ సర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకు హాజరుకావాలని అన్నారు.
SKLM: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కుటుంబ సమేతంగా మంగళవారం ఎచ్చెర్ల టీడీపీ నాయకులు విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రాష్ట్రపతి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు AP రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
TG: ఆశ్రమ, గురుకుల స్కూళ్లలో సదుపాయాలపై దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆశ్రమ, గురుకుల స్కూళ్లలో ఆహార నాణ్యత లోపించిందని శ్రీగురు తేజ పిల్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
KNR: రోడ్లు, భవనాలశాఖ ద్వారా మానకొండూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో కొత్త పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులే కాకుండా కొత్త పనులకు నిధుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తి చేయించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఛాంబర్లో కలిశారు.
ప్రకాశం: సైబర్ నేరాలపై మరియు హెల్మెట్ల వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు కంభం సీఐ కే.మల్లికార్జునరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. హెల్మెట్లు ధరించి ప్రయాణించడం సురక్షితమన్నారు.
MBNR: అమ్మాయిలను వేధించే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షి టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. మంగళవారం మక్తల్ గురుకుల పాఠశాల, కలశాలలో విద్యార్థులకు షి టీమ్ పై అవగాహన కల్పించారు. ఆకతాయిలు వేధిస్తే షీ టీం పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.