VZM: భారతీయుల ఆత్మగౌరవానికి భారత రాజ్యాంగం ప్రతీక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురజాడ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మన రాజ్యాంగం సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగమని, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశందేనని అన్నారు.