GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్లోని ఫంక్షన్ హాల్లో మంగళవారం ముస్లిం మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరిన ఆయన, కుట్టు మిషన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.