ATP: యాడికి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాలను నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. పంటల సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. పంటలకు రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు.