KRNL: కర్నూలు మండల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి. రామకృష్ణ తాగునీరు, రోడ్లు–డ్రైనేజీ, శ్మశాన భూములు, గృహ స్థలాలు, రైతులకు సాగునీరు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 సాయం అలాగే రైతుల భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.