GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి పరిష్కరించాలని కోరారు.