WGL: హన్మకొండలో జరిగిన ఎస్జీఎఫ్ జోనల్ క్రీడల్లో పర్వతగిరి మండల కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ వనిత అచ్చుతాపై జూనియర్ కళాశాల విద్యార్థిని గుగులోతు వెన్నెల అండర్–19 వాలీబాల్ జట్టుకు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ నెల 28–30 తేదీల్లో సిరిసిల్లలో జరిగే రాష్ట్ర మీట్లో పాల్గొననున్నట్టు మంగళవారం ప్రిన్సిపల్ జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వెన్నెలను పలువురు అభినందించారు.