కృష్ణా: జుజ్జవరం గ్రామం జాతీయ రహదారి ఎన్ హెచ్–65పై రోడ్డు ప్రమాదాల నివారణకు సీఐ శుభకర్ వానదారులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి, అతివేగంగా వాహనాల నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.