BPT: చుండూరులో జూదం ఆడుతున్న ఐదుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 950 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించాలంటే 112కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.
KMM: AP నుంచి TGకు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం మధిర రూరల్ పోలీస్ స్టేషన్ను అడిషనల్ డీసీపీ సందర్శించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలని సూచించారు.
TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఆస్తులను ED అటాచ్ చేసింది. రూ.14.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. PMLA కింద సదరు సంస్థపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మోసపూరిత రియల్ ఎస్టేట్ స్కీమ్ ద్వారా డిపాజిటర్లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకే ప్లాట్లకు పలువురికి విక్రయించినట్లు, రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి డబ్బులు సేకరించినట్లు విచారణలో తేలింది.
ELR: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పలువురు సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు.
HNK: కాకతీయ మెడికల్ కళాశాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. CP సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… కమిషనరేట్ పరిధిలో పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
KRNL: CM చంద్రబాబుని ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు శనివారం కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. టెక్స్టైల్ పార్క్, AI స్కిల్ సెంటర్, పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. నీటి సమస్యలు నిర్మాణంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
CTR: ఏపీ రాష్ట్ర రెడ్డి సంఘం ఐటీ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కార్వేటినగరం(M) ముక్కురానిపల్లికి చెందిన మహేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, సమాజం పట్ల చూపిన అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి తెలిపారు.
KDP: వల్లూరు(మం) పుష్పగిరి సంతాన మల్లేశ్వర స్వామి ఆలయం ఎదుట ఒకే విగ్రహంలో వృషభం, నందికేశ్వరుని మానవ రూపాలు దర్శనమివ్వడం విశేషం. ఈ అరుదైన శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేష్ పరిశీలించి వివరాలు వెల్లడించారు. పశుత్వం నుంచి దైవత్వానికి మార్పును సూచించేలా నంది పాదాల మధ్య నందికేశ్వరుడు అర్ధపద్మాసనంలో ఉండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
MHBD: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరోల్ మండలంలోని కాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మురళికృష్ణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: అద్దంకి సమీపంలోని శ్రీనివాస నగర్ వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో గోవాడ గ్రామానికి చెందిన గెల్లా యేసు రాజు (20) గాయపడ్డాడు. గోవాడ నుంచి అద్దంకి వైపు వెళ్తుండగా, రోడ్డు అంచున బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
MNCL: మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన పి.చంద్రయ్య పదోన్నతిపై జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్నారు.
KNR: చొప్పదండి మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం ఛైర్ పర్సన్ వడ్లూరి సరిత, కమిషనర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు, అమృత్ 2.0 పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. పారిశుద్యం పనులు, మంచినీటి సరఫరా, పన్ను వసూళ్లపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మానస పాల్గొన్నారు.
KMR: గాంధారి మండలం నేరేల్ తండా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్ బండారు రమేశ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కందులకు క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులకు మేలు చేసేందుకే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ నెహ్రూ ఉన్నారు.
GNTR: చంద్రగ్రహణం కారణంగా తెనాలిలోని వైకుంటపురం ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేస్తున్నట్లు శనివారం ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు, మహా నివేదన నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. తిరిగి మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఉదయం 8 గంటల నుంచి ఆలయం తెరవనున్నారు.