AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ తాను సమాధానాలు ఇచ్చానట్లు ఆయన తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరవుతానని, దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ కేసులో నిజా నిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని ఆయన వెల్లడించారు.