ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ చేపట్టారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రంకన్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటి రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు.